వైసీపీ కోవర్టులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోజా..

వైసీపీ  కోవర్టులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్‌కుమార్ కి నగరి‌ ఎమ్మెల్యే ఆర్.కే.

 Ycp Mla Roja Complaints To Chittoor Sp On Ycp Coverts Who Changed The Party Deta-TeluguStop.com

రోజా ఫిర్యాదు చేశారు.ఇవాళ చిత్తూరులోని ఎస్పి బంగ్లాలో ఎస్పిని‌ కలిసి విన్నతి‌ పత్రం అందించారు.

అనంతరం ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ లో ఉంటూ టీడీపీతో జత కలిసి పార్టీ కి ద్రోహం చేసే వారిని ఉపేక్షించేది‌ లేదంటూ రోజా‌ మండి‌పడ్డారు.

ఏపి డిజిపి పోటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో‌ ఫోటోలు వేసుకుని ఫ్లేక్సీలు వేసుకుని అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.

గతంలో వైసీపీ లో సస్పెండ్ అయిన వారు వైసీపీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్ కుమార్ కి ఫీర్యాదు చేసినట్లు ఆర్.కే.రోజా‌ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటిసి, ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube