అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో పుష్ప సినిమా కోసం బన్నీ అభిమానులు అనంతపురంలో రచ్చ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం లో ఒక థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.పుష్ప బెనిఫిట్ షో వేస్తామని చెప్పి వేయకపోవడంతో అభిమానులంతా కలిసి ఇక్కడ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు.
హిందూపురం బాలాజీ థియేటర్ యాజమాన్యం పుష్ప బెనిఫిట్ షో వేస్తామని టికెట్ కు 500 రూపాయలు వసూలు చేసి బెనిఫిట్ షో వేయలేదని అభిమానులంతా ఆరోపించారు.
బెనిఫిట్ షో ఉందని అనుకోని అభిమానులంతా థియేటర్ వద్దకు చేరుకున్నారు.
అయితే బెనిఫిట్ షో వేయలేదని బన్నీ అభిమానులంతా థియేటర్ వద్దకు చేరుకొని థియేటర్ పై రాళ్ల దాడి చేసారు.విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టి థియేటర్ గేట్లు మూసేసారు.ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే ఎర్రచందనం స్మగ్లర్ గా పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు.
ఇందులో పుష్పరాజ్ కు ప్రేయసిగా రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.అల్లు అర్జున్ కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేయడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేసారు.ఒకేరోజు రెండు రాష్ట్రాలను చుట్టేస్తూ బన్నీ కూడా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొన్నాడు.
ఈ సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ కు మంచి స్పందన లభించింది.ఈ సాంగ్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.మరి కొద్దీ సేపు ఆగితే కానీ ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది.