అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుక్లపక్ష మూడవ రోజు వస్తుంది.ఈ క్రమంలోనే 2021 సంవత్సరంలో మే 14న హిందువులు అక్షయ తృతీయ జరుపు కుంటారు.
ఈ అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు.ఇంతటి పవిత్రమైన రోజున మనం ఏ కార్యం నిర్వహించిన మంచి జరుగు తుందని పండితులు చెబుతున్నారు.
ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ప్రజలు పెద్ద ఎత్తున బంగారు నగలు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు.అదే విధంగా దానధర్మాలను కూడా చేస్తారు.మరి రాశి ప్రకారం ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయడం వల్ల శుభం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…
*మేష రాశి:
ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున ఎర్రటి పప్పు ధాన్యాలను, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పుష్పాలను దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
*వృషభం:
ఈ రాశివారు ఆవు దూడ, బియ్యం, నీలి రంగు వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.
*మిధునం:
మిధున రాశి వారు ఈ రోజు పప్పు ధాన్యాలు, బంగారం, ఆకు పచ్చ రంగులో ఉన్నటు వంటి ఏ వస్తువులైన దానం చేయాలి.
*కర్కాటకం:
ఈ రాశివారు ఎంతో పవిత్రమైన ఈ రోజున చక్కెర, పాలు, పెరుగు, వెండి, తెలుపు రంగు వస్త్రాలను, ముత్యాలు వంటివాటిని దానం చేయడం ఎంతో ఉత్తమం.
*సింహం:
ఈ రాశి వారు కొవ్వొత్తులు, కర్పూరం, రాగి, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయాలి.
* కన్య:
అక్షయ తృతీయ రోజు కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మొక్కలు లేదా బట్టలు, కూరగాయలను దానం చేయాలి.
*తుల:
ఈ రాశివారు నువ్వులు, మజ్జిగ, పెరుగు, చెప్పులు, నీలిరంగు వస్త్రాలను దానం చేయాలి.
* వృశ్చికం:
వృశ్చిక రాశి వారు ఈరోజు గంధం, తిలకం, ఎరుపు రంగులో ఉండే వస్తువులను, వస్త్రాలను దానం చేయడం ఎంతో శుభకరం.
* ధనస్సు:
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున మతపరమైన పుస్తకాలు, పసుపు రంగు బట్టలు, తీపి అన్నం వంటి వాటిని దానం చేయాలి.
* మకరం:
మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున నల్లటి వస్తువులను, ఇనుమును, నలుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.
* కుంభం:
ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున కొబ్బరి నీళ్ళు, గొడుగు, చెప్పులు ఏడు రకాల ధాన్యాలను దానం చేయాలి.
* మీనం:
ఈ రాశి వారు బంగారం లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.