ఇటీవల రాష్ట్రంలో జరిగిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికల తర్వాత వెలువడిన ఫలితాలపై టీడీపీ నేతలు వైసీపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.నాలుగో విడుదల టిడిపి పార్టీ బలపరిచిన అభ్యర్థులు 848 మంది గెలవటం జరిగిందని, జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు రెడీ అయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు.ఇంకా వర్ల రామయ్య మాట్లాడుతూ చీకటి పడిన తరువాత ఫలితాలు తారుమారు చేస్తున్నారు అంటూ వైసీపీ నాయకుల పై ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో డీజీపీ అధికార పార్టీకి తొత్తుగా మారినటు కూడా సీరియస్ కామెంట్లు చేశారు.పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయాల శాతం.ఉన్న కొద్ది పెరిగింది అంటూ.టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు.మొదటి దశ ఎన్నికల్లో 38.7 శాతం గెలిస్తే, రెండో దశలో 39.5 శాతం, మూడో దశలో 41.4 శాతం, నాలుగో దశలో 50 శాతం టీడీపీ బలపరిచిన అభ్యర్థులు మద్దతుదారులు విజయం సాధించినట్లు స్పష్టం చేశారు.