ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) :ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమొద ముద్ర వేసిన సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ( Sunke Ravi Shankar )మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ముంద కృష్ణ మాదిగ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతుందని అన్నారు.

దీంతో పాటు ఏబిసిడి వర్గీకరణ చేయాలని కోరుతున్నామని అన్నారు.ఇది ఒక జాతికి దక్కిన గౌరవంగా అభివర్ణిస్తూ ఇది తీపి కబురు అని అన్నారుఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ వైసీపీ కొనుకటి నాగయ్య, నాయకులు గుంటీ శంకర్ ,నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, ఎమిరెడ్డి మల్లారెడ్డి ,ముద్దం రవీందర్ , నల్లగొండ అనిల్ కుమార్ గౌడ్ ,భీమనాతుని రమేష్ ,గురజాల కోటి, కమలాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

వేములవాడ గోశాల సందర్శనలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Latest Rajanna Sircilla News