మునుగోడులో రాష్ట్ర మంత్రుల పర్యటన

నల్గొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శశ్రీనివాస్ యాదవ్ పర్యటించారు.

ముందుగా మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామంలో గొర్రెలకు, పశువులకు వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు,అనంతరం స్థానిక పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ బండ ప్రకాష్,ఫిష్ అండ్ గోట్ చైర్మన్ బలరాజ్ యాదవ్,డిఐడిఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి,మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కుపై ఫోటో ప్రదర్శన...!

Latest Nalgonda News