వైరల్ పిక్: ఆ చెట్టుకు ఒక వైపు కొమ్మలు ఉన్నాయ్.. మరోవైపు ఏమయ్యిందో..?!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.దీనితో ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ ప్రజలందరికీ ఇట్లే క్షణాలలో తెలిసిపోతుంది.

ఈ క్రమంలో ఎక్కువగా మనం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు, సింహాలు, ప్రకృతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా ఒక చెట్టుకు ఒకే వైపు కొమ్మలు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఆ చెట్టు ఎక్కడ ఉందని అనుకుంటున్నారా.? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఇంగ్లాండ్ లోని భారత సంతతికి చెందిన భారత్ మిశ్రా కుటుంబం అక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు.

వారి ఇంటి ఆవరణంలో అకోనిఫెర్ జాతి చెట్టును వారు పెంచుకుంటూ ఉన్నారు.ఈ క్రమంలో ఆ చెట్టు చాలా పెద్దది గా అయిపోయి పొరిగింటి వారి సరిహద్దు వైపు కూడా వాలిపోయింది.

Advertisement

ఆ చెట్టుపై కొన్ని పక్షులు రావడం అవి గుళ్ళు కట్టుకోవడం, అలాగే వారి సరిహద్దు పై ఉన్న కొమ్మలకు గుడ్డు పెట్టి పరిసరాల మొత్తం కూడా ఆపరిశుభ్రంగా చేస్తున్నాయని తరచుగా వారు మిశ్రా తో గొడవలు పడుతూ ఉండేవారు.

అయితే ఈ క్రమంలో ఒక రోజు పొరుగింటి వారి సరిహద్దులో ఉన్నవారి సరిహద్దులో ఉన్నకొమ్మలు పూర్తిగా కట్ చేసారు.దీంతో ఆ చెట్టు మొత్తం ఒకవైపుకు కొమ్మలు లేకుండా సగం మాత్రమే ఉండిపోయింది.దీంతో అక్కడి ఉన్న వారు కొంతమంది ఆ ఫోటో ను వారి కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అయితే ఈ ఫోటోను చూసిన కొంత మంది నెటిజన్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు వారి స్టైల్ లో కామెంట్స్ పెడుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటో ను చూసేయండి.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు