అందుబాటులో ఉంటా మీకు సేవ చేసుకుంటా - వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం తిప్పాపురం రెడ్డి కాలనీ చర్చి దగ్గర ఎన్నికల ప్రచారం నిర్వహించిన వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేను మీ పేద బిడ్డను నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

అందుబాటులో ఉంటా మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి అని ఓటర్లను అభ్యర్థించారు, నేను నాలుగు సార్లు ఓడిన ప్రజల మధ్యలో ప్రజా సమస్యలు పరిష్కరించడం జరిగిందని.

ఒక్కసారి ప్రజలు ఆలోచించండి అధికార పార్టీ నుండి పోటీ చేసే అభివృద్ధి ఈ ప్రాంతానికి కానీ ఇక్కడ ప్రజలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఈరోజు పోటీ చేస్తున్నాడు అందుకు తగిన రీతిలో మీరు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.ఈ కార్పొరేట్ శక్తులు ఈరోజు వేములవాడలో పోటీచేయాలని వస్తున్నారే వారికి ఇక్కడి ప్రజలు కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి ప్రజలు గుర్తుకు రాలేరా అని ఆయన ప్రశ్నించారు.

మీ బిడ్డను మీ పేద బిడ్డను ఒక్క అవకాశం ఇచ్చి నన్ను వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించండి ఆయన అన్నారు.పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కూరగాయల కొమరయ్య , కనికరపు రాకేష్, లింగంపల్లి కిరణ్, ఎన్నారెడ్డి, బైరగోని చిరంజీవి, సూగురి సుధాకర్, గుర్రం తిరుపతి, తదితరులు ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News