పరువు హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శక్షించాలి: దళిత సంఘాల నేతలు

నల్లగొండ జిల్లా:ఆదివారం త్రిపురారం మండలం గుంటిపల్లి అన్నారం గ్రామానికి చెందిన దళిత యువకుడు ఇరిగి నవీన్ బీసీ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని కుల దురహంకారంతో హత్యకు పాల్పడిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

సోమవారం వారు డిఎస్పీని కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Latest Nalgonda News