ప్రమాదాల నివారణ పై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై గణేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్ లతో ఎస్సై గణేష్ ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించారు.

అలాగే మండల ప్యాసింజర్ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ.ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై గణేష్, కానిస్టేబుల్ కాసిం శ్రీనివాస్, హోంగార్డు వెంకట్ సిబ్బంది మనోహర్ తో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువద్దాము.- మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్.
Advertisement

Latest Rajanna Sircilla News