ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని ఇంటికి వెళుతూ ఉంటారు.అంతే కాకుండా భక్తులు వారి మొక్కులను చెల్లించుకుని శ్రీవారికి తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు.
తిరుమలలో ఫిబ్రవరి 5వ తేదీ నా పౌర్ణమి గరుడ సేవా వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మాలయప్ప స్వామి వారు గరుడ వాహనం పై దేవాలయ నాలుగు మడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు దేవాలయా అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 5వ తేదీన తిరుమల దివ్య క్షేత్రంలో శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

పురాణాల ప్రకారం తిరుమలలో మూడు కోట్ల 50 లక్షల పుణ్యతీర్దాలు ఉన్నాయని వెల్లడించారు.అయితే ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థాలు ప్రముఖమైనవి.వీటిలో స్వామి పుష్కరిణి తీర్థము, కుమారధార తీర్థము, ఆకాశగంగా తీర్థము పాప వినాశన తీర్థము, పాండవ తీర్థము, అత్యంత ప్రసిద్ధమైనవి అని చెబుతున్నారు.
స్నానమాచరించిన తర్వాత భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని తెలుపుతున్నారు.శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి సంవత్సరం మాఘమాసం నందు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ పుణ్యతీర్ధము స్వామివారి దేవాలయానికి ఆరు మైళ్ళ దూరంలో ఉంది.పౌర్ణమి రోజు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినము దేవాలయాలు అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
మనిషి అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువును దూషించినందువల్ల కలిగినటువంటి దోషములను ఈ పుణ్యతీర్ధమునందు స్నానమాచరించడం వల్ల దోషం నుంచి విముక్తి పొందవచ్చు.కానీ ఈ పుణ్యక్షేత్రంలో స్నానమాచరించిన తర్వాత గురువును, తల్లిదండ్రులను, పెద్దవారిని కూడా గౌరవ మర్యాదలతో చూసుకోవడం మంచిది.