ప్రణబ్‌ దాదా ఆరోగ్యం మరింత విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అనారోగ్యంతో ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.

ఆయనకు ఇటీవలే ఆపరేషన్‌ జరుగగా ఇదే సమయంలో కరోనా కూడా అటాక్‌ అవ్వడంతో ఆయన కోలుకోలేక పోతున్నారు.

ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ఈ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంతో పాటు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆసుపత్రి వర్గాల వారు ఆయన పరిస్థితి మరింత విషమించింది అంటూ ప్రకటించారు.శ్వాస ఇబ్బందితో పాటు ఆయన ఊపిరి తిత్తులు ఇన్ఫెక్షన్‌ సోకవడంతో పాడయ్యాయి అంటూ ప్రకటించారు.

ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ మరియు ఇతర అవయవాలకు సంబంధించిన పనితీరు కూడా సరిగా లేదంటూ వైధ్యులు పేర్కొన్నారు.

Advertisement

దాంతో ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.మరో వైపు ఆయన అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం కుదుట పడాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?
Advertisement

తాజా వార్తలు