సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభాస్..!!

కేజిఎఫ్" డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తో “సలార్” అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ప్రభాస్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్టు ప్రకట్టించిన తర్వాత మాస్ తరహాలో హీరోని సరైన రీతిలో  చూపించాడంలో దిట్ట అయినా డైరెక్టర్ గా పేరొందిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ తో మూవీ అనేసరికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యాం” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

రొమాంటిక్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాత కాలం నాటి లవ్ స్టోరీ ని ఆధారం చేసుకుని చిత్రీకరిస్తున్నారు.ఒక లవ్ స్టోరీ మాత్రమే కాక యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండేలా సినిమా యూనిట్ రెడీ అవ్వడం జరిగింది.ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఈ ఏడాది ప్రారంభంలో న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ రెడీ అవ్వగా చివరి నిమిషంలో వాయిదా పడటంతో.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ చెందారు.ఇటువంటి నేపథ్యంలో తెలుగు ప్రజలకు పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగను ఆధారం చేసుకుని ముహూర్తం ఫిక్స్ చేసి ఆ రోజు “రాధేశ్యాం” టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.

Advertisement

దాదాపు ఈ సినిమాకి సంబంధించిన ముప్పై సెకన్ల వీడియోని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం.ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాకి సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ ని  ఎంతగానో అలరించాయి.

కాగా త్వరలో సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. .

Advertisement

తాజా వార్తలు