మోడీని కలవడం ఆనందంగా ఉంది - కోనేటి సాయిలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఉత్సాహాన్ని మరింత నింపిందని ఎస్ టి మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేటి సాయిలు అన్నారు.

బుధవారం వేములవాడకు పార్లమెంటు ఎన్నికల లో భాగంగా వేములవాడలో జరిగే బహిరంగ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా మొదటగా రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకునే సందర్భంగా స్వాగతం పలకడానికి పలువురు కార్యకర్తలను జిల్లా బిజెపి నాయకత్వం ఏర్పాటు చేయగా అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కోనేటి సాయిలు ఈ విధంగా కలుసుకున్నారు.

ఇలాంటి అవకాశం భారతీయ జనతా పార్టీలో ఉంటుందని తనకు దక్కడం గౌరవంగా ఉందన్నారు.

అధిక బ‌రువు ఉన్న‌వారు జీడిప‌ప్పు తింటే ఏం అవుతుందో తెలుసా?

Latest Rajanna Sircilla News