దశాబ్ది ఉత్సవాల సమావేశానికి ప్రజా ప్రతినిధులు,అధికారులు గైర్హాజరు...!

అనంతగిరి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల సమావేశానికి ఎంపీటీసీలు,సర్పంచులు, అధికారులు హాజరు కాకపోవడంతో నామ మాత్రంగా సమావేశం నిర్వహించారు.

అనంతగిరి మండల ఎంపీపీ,19 గ్రామ పంచాయితీ నుండి కేవలం 6గురు సర్పంచులు, కార్యదర్శులు హాజరు కాగా,దశాబ్ది ఉత్సవాల సమావేశానికి( Telangana Decade Celebrations ) మిగతా వారు ఎవరు కనిపించక పోవడం గమనార్హం.

ఉదయం 11:30 గంటల వరకు మండల ప్రజా పరిషత్ అధికారులు ఎదురుచూసినా ఎవరు రాకపోవడంతో నామమాత్రంగా సమావేశం నిర్వహించి ముగించారు.ప్రభుత్వ ఆదేశాలతో జరిగే సమావేశానికి వివిధ శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Validation Check 2026

Latest Suryapet News