తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ఇవాళ ఉదయం స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో ఎస్.
పి.ఎఫ్ డీజి సంతోష్ మెహరా, ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాధ్ తిల్ హరి, తెలంగాణ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వైసీపి ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.