భక్తులతో పోటెత్తిన మహానంది క్షేత్రం.మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు.
కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి రోజు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తి,శ్రద్ధలతో ప్రారంభించారుమహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుణ్య క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.ఫలితంగా మహానంది క్షేత్రం కిక్కిరిసిపోతుంది.
ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని వేదనాథ శివనామస్మరణంతో పాటు పండిత,అర్చకులు ఉదయం అమజ్ఞ మహేశ్వర,గోపూజ,పుణ్య వాహనం తదితరాలు నిర్వహించారు.మధ్యాహ్నం వాస్తు, పర్వగ్నికరణం, అంకురార్పణ కలశస్థాపన, ధ్వజారోహణం మయూర వాహన సేవలు జరిపారు.