మతిమరుపే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.. అదెలాగో తెలిస్తే..

అమెరికా దేశం, మిస్సూరి రాష్ట్రంలో (Missouri, US country)నివసించే ఒక వ్యక్తి తన మతిమరుపు కారణంగా అనుకోకుండా కోటీశ్వరుడు అయ్యాడు.

ఇటీవల అతడి భార్య ఫోన్ చేసి, “నీ లంచ్ ఇంట్లో మర్చిపోయావు” అని చెప్పింది.

ఇంటికి వెళ్లి లంచ్ తీసుకుని వచ్చే బదులు, అతను దగ్గరలోని ఒక గ్రోసరీ స్టోర్‌కి వెళ్లి తినడానికి ఏదైనా కొనాలని నిర్ణయించుకున్నాడు.ఆ నిర్ణయమే అతన్ని ఒక పెద్ద అదృష్టవంతుడిని చేసింది.

ఆ గ్రోసరీ స్టోర్‌లో లాటరీ టిక్కెట్లు (Lottery tickets)కనిపించడంతో అతను ఒకటి కొన్నాడు.ఇంతకుముందు లాటరీతో గెలిచిన డబ్బుతోనే ఆ టిక్కెట్ కొన్నాడు.ఆ టిక్కెట్ రబ్ చేసి చూసినప్పుడు, 3 మిలియన్ డాలర్ల జాక్‌పాట్ (సుమారు రూ.25.24 కోట్లు) గెలిచానని తెలుసుకున్నాడు.అనుకోకుండా కోటీశ్వరుడు అయిపోవడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆరోజు లంచ్ బాక్స్ మర్చిపోక పోతే ఈ అదృష్టం అతనికి దక్కి ఉండేది కాదు.

Advertisement

ఆయన లాటరీ టిక్కెట్ స్క్రాచ్ చేసి చూసినప్పుడు, అందులో గెలిచిన నంబర్లు కనిపించాయి.ఆ తర్వాత, తన ఫోన్‌తో ఆ టిక్కెట్‌ని స్కాన్ చేశాడు.అప్పుడు, “లాటరీ విన్నర్” అని ఒక మెసేజ్ వచ్చింది.

అంతే, ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోయాడు.ఏం జరిగిందో అర్థం కాలేదు.

“నేను సాధారణంగా 30 డాలర్ల టిక్కెట్లు కొనను.కానీ ముందు నేను ఇతర టిక్కెట్లతో గెలిచిన 60 డాలర్లు ఉన్నాయి కాబట్టి, ‘ఎందుకు కొనకూడదు?’ అని అనుకున్నాను” అని ఆయన చెప్పాడు.

“నేను చాలా ఆశ్చర్యపోయాను.నేను గెలిచానని నాకు అర్థం కాలేదు, ఆ తర్వాత నేను ఆన్ని సున్నాలను చూశాను.చాలా డబ్బులు గెలిచినట్లు తెలిసింది” అని అన్నాడు.

శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్... తన సలహా తప్పనిసరి అంటూ?
కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!

కోట్లు గెలిచిన ఆనందంతో ఆయన తన భార్యకు వెంటనే ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పాడు.మొదట ఆమె నమ్మలేదు, జోక్‌గా చెబుతున్నాడని అనుకుంది.

Advertisement

“నేను ఎప్పుడూ ఫన్నీగా మాట్లాడతాను.అందుకే నా భార్యకు నన్ను నమ్మేందుకు చాలా టైమ్ పట్టింది!” అని ఈ లక్కీ విన్నర్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఆ డబ్బును సీక్రెట్ గా ఉంచడానికి ఆయన ట్రస్ట్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఈ అమౌంట్ తమ జీవితాలను పూర్తిగా మార్చబోతుందని, తెలివైన నిర్ణయాలు పెట్టబోతున్నారని కూడా అన్నాడు.

తాజా వార్తలు