విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులను పురస్కరించుకొని.ద్వారకాతిరుమల ఈవో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ద్వారకా తిరుమల నుంచి అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.ఈ నేపథ్యంలో దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకురావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
గతంలో అమ్మవారి సన్నిధిలో ఈవోగా పనిచేశానన్న ఆయన స్వామివారు, అమ్మవారి దర్శనం అయితేనే చాలు అనుకునే వాళ్ళమని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు ద్వారకా తిరుమల ఆలయ చైర్మన్ సుధాకర్ రావు ,ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.