చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు

చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి.జిల్లాలోని పలమనేరు, గంగవరం మండలాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

ఒక్కసారిగా భూమి నుంచి ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అనంతరం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

కాగా భూమి కంపించడంతో పలు చోట్ల ఇళ్లకు స్వల్ప పగుళ్లు ఏర్పడ్డాయి.రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.7 గా నమోదు అయిందని అధికారులు తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement