తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీగా ఉంది.ఫిబ్రవరి ఒకటో తేదీన దాదాపు 61 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
దాదాపు 26,000 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.ఒకటవ తేదీన స్వామి వారి హుండీ ఆదాయం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు.
ఇంకా చెప్పాలంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.దీనివల్ల టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వ దర్శనం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతుంది.
ఇలా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది.ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి స్వామివారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది.స్వామి వారి పై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి అరుదైన సుగంధ పుష్పాలతో స్వామి వారిని అర్చకులు అలంకరిస్తారు.దీనిని పూలంగి సేవ అని అంటారు.ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు వాహన భగవచ్చాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు చేస్తూ ఉంటారు.శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం ప్రత్యూష కాల ఆరాధనతో దేవాలయ ద్వారములను అర్చకులు తెరుస్తారు.బంగారు ఆకలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిని మేలుకొలుపుతారు.
వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు స్వామివారి సన్నిధిలో ప్రవేశించి స్వామి వారి మొదటి దర్శనం చేసుకుంటూ ఉంటారు.బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత సోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం పట్టిస్తూ ఉండగా సన్నిధిలోని వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చిపాలను నివేదిస్తారు.
DEVOTIONAL