కేంద్ర జలవనరుల సంఘం కీలక సమావేశం నేడు జరగనుంది.ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో అధికారులు భేటీకానున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు.పోలవరం డ్యాం నిర్మాణం, రాష్ట్రాల అభ్యంతరాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఇటీవలే నాలుగు రాష్ట్రాల అధికారులతోత కేంద్రం వర్చువల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పోలవరం బ్యాక్ వాటర్ పై మూడు రాష్ట్రాలకు కేవలం అపోహలు ఉన్నాయని, తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్రం వెల్లడించింది.
ఈ క్రమంలోనే బ్యాక్ వాటర్ సర్వేకు సంబంధించి సాంకేతిక అంశాలపై చర్చించేందుకు మళ్లీ ఈరోజు సమావేశం కానున్నారు.