స్వీప్ ఆద్వర్యంలో సిరిసిల్లలో 2కే రన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: అర్హులైన వారందరూ స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిరిసిల్ల అసిస్టెంట్  రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి పిలుపు నిచ్చారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు (స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు  సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఐ ఓట్ ఫర్ ష్యూర్ పేరిట 2కే రన్ ను అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు చేపట్టగా, సిరిసిల్ల అసిస్టెంట్  రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేశారు.అనంతరం జెండా ఊపి రన్ ను అదనపు కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు.

భారత రాజ్యాంగము కల్పించిన ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ హక్కును వినియోగించుకావాలని పేర్కొన్నారు.

అనంతరం సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ మాట్లాడారు.వోటర్ హెల్ప్ లైన్ యాప్(వి ఎచ్ ఎ ) లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత వయసు, ఆన్లైన్, ఆఫ్ లైన్ లో ఓటు హక్కు ఎలా నమోదు చేయాలి, ఫారం నెంబర్ 6 వినియోగం, ఈ ఏడాది 31వ మార్చి తేదీ వరకు 18 సంవత్సరాల నిండిన వారు ఓటును నమోదు చూసుకోవాలని సూచించారు.

Advertisement

  రానున్న లోక్ సభ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటు హక్కు వినియోగించు కునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని కోరారు. యువత కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకావాలని సూచించారు.

ఈ 2 కే రన్ లో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ షరీఫ్ మోహినొద్దిన్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్, జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ అధికారి రాందాస్, పెన్షన్ ఏపీఓ పాపారావు, సిరిసిల్ల నియోజక వర్గoలోని పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News