రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ గ్రామపంచాయతీ ఆవరణలో పోస్టల్ శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాలపై గ్రామ ప్రజలకుతపాలా శాఖ సిరిసిల్ల సబ్ డివిజన్ మెయిల్ ఓవెర్సెర్ సాయిరాం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తపాలా శాఖ అధికారులు మాట్లాడుతూ గ్రామా ప్రజలు పొదుపు అలవాటు చేసుకోవాలని అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
అందుకోసం తపాలా శాఖ అందిస్తున్న వివిధ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.ప్రతి ఇంటికి తపాలా బీమా అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయతీ కార్యదర్శి మహేందర్ , మాజీ సర్పంచ్ కదిరె శ్రీనివాస్ తపాలా శాఖ మెయిల్ ఓవర్సీర్ రాజు , కిషన్ దాసుపేట సబ్ పోస్ట్ మాస్టర్ మాలోతు రాజు , దుమాల గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్ సతీష్ తో పాటు పలువురు తపాలా సిబ్బంది పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy