కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యత్ర తెలంగాణలో సాగుతోంది.
అల్లాదుర్గం మండలం నుంచి ఈరోజు రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది.
లండన్ లోని ఎక్స్టెల్ సెంటర్ లో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక సదస్సులో తెలంగాణ పర్యాటక సంస్థ ఒక ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేయనుంది.
ఎం డి ఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల ఆరవ తేదీన రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
స్పెషల్ క్యాజువల్ లీవ్ గా సకల జనుల సమ్మె పేరుతో అప్పట్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కాలాన్ని నమోదు చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.
దాతల సహకారంతో క్షయరోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు.
తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కు 3 నెలల కాలంలో 1382 మిలియన్ యూనిట్లు నష్టపోయినట్లు ఆడిట్ నివేదికలో బయటపడింది.
రాష్ట్రంలో టెక్నాలజీ స్టార్తప్ లకు టీ హబ్ కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
తిరుమల శ్రీవారిని ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.ఏపీ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు దర్శించుకున్నారు
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పిఎ దేవేంద్ర శర్మను ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దర్శక నిర్మాతగా అర్జున్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా ఉన్న విశ్వక్ సేన్ ను తప్పించినట్లుగా అర్జున్ ప్రకటించారు.అంతేకాకుండా ఆయనపై నిర్మతల మండలికి ఫిర్యాదు చేయనున్నట్లు అర్జున్ తెలిపారు.
టిడిపి అధినేత చంద్రబాబు కళ్ళు ఉన్న కబోది అంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజు విమర్శించారు.
తిరుమల శ్రీవారి ఆస్తుల పై శ్వేత పత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మ రెడ్డి విడుదల చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్ల సుఫారీ ఇచ్చారని టిడిపి కీలక నేత బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు.
దేశవ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ఓటింగ్ పలితాల లెక్కింపు ఈరోజు జరుగుతోంది.
వచ్చే నెల 1 నుంచి వీఐపీ దర్శనంకు ఉదయం 08 నుంచి 12:00 వరకు అవకాశం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఈనెల 11న భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోది శంకుస్థాపన చేయడం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
బిజెపి, టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శించారు.భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మహాసముద్రంలోకి ప్రవేశించిన చైనా నిఘానౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది.చైనా నిఘా నౌక హిందూ మహాసముద్రంలో ప్రవేశించిన నేపథ్యంలో భారత శకుని పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది.
ఈనెల 12వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోది రాక సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జన సమీకరణ చేపట్టి సభ దద్దరిల్లేలా చేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,280 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy