చాణక్యుడికి( , Chanakya ) రాజకీయాలే కాకుండా సమాజంలో చాలా విషయాలలో అపరమైన జ్ఞానం, అనుభవం ఉంది అని దాదాపు చాలామందికి తెలుసు.ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, దౌత్యం కాకుండా ఆచరణాత్మక జీవితం గురించి కూడా చాలా విషయాలు చాణక్యుడికి తెలిపాడు.
ప్రస్తుత సమాజంలో కూడా ఆయన మాటలు సూత్రాలు ప్రజలకి కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఎవరైనా చాణక్య నీతిని సరిగా పాటిస్తే జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
చాణక్య ధర్మం ప్రకారం మనిషికి ఇతరులను సరిగ్గా అంచనా వేయగల సామర్థ్యం ఉంటే వారి జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు.

పాము, తేళ్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మన చుట్టూ ఎంతమందో ఉన్నారు.వారిని గుర్తించి వారికి దూరంగా ఉండే సామర్థ్యం మనకు ఉండాలి.అలాగే జీవితంలో ఎప్పుడూ అలాంటి వ్యక్తుల నుంచి సహాయం కూడా తీసుకోకూడదు.
ముఖ్యంగా చెప్పాలంటే చాణక్య నీతి ప్రకారం పుట్టుకతో అంధుడైన వ్యక్తి దేనిని చూడలేడు.కామం, క్రోధం, మత్తు నిండిన వ్యక్తి అది తప్ప మరొకటి చూడలేడు.
అదే సమయంలో స్వార్ధపరులు ఎవరికి సహాయం చేయరు.అలాగే స్వార్థపరుడితో స్నేహం చేయకూడదు.
అలాగే వారి సహాయం కూడా కోరకూడదు. స్వార్థపరులను( Selfish people ) పొరపాటున కూడా నమ్మకూడదని ఆచార్య చాణక్యుడికు చెప్పాడు.

ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం క్రూర స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ దూరంగా ఉండాలి.ఎందుకంటే కోపం మనిషికి ప్రధాన శత్రువు కోపంగా ఉన్నప్పుడు ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.కోపం తెచ్చుకోవడం వల్ల తనకు ఇతరులకు హాని కలుగుతుంది.కోపం లోని వ్యక్తి మంచి చెడును అసలు తెలుసుకోలేడు.అలాంటి వ్యక్తులు శత్రువుల( Enemies ) కంటే ప్రమాదకరం వారి నుంచి సహాయం తీసుకోకూడదు.ఇంకా చెప్పాలంటే అత్యాశ( Greedy ) అసూయపడే వ్యక్తులకి ఎప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
కష్ట సమయాల్లో కూడా అలాంటి వారి నుంచి సహాయం తీసుకోకూడదు.ఎందుకంటే అత్యాశ పడే వ్యక్తులు మీకు మంచికి బదులుగా హాని చేస్తారు.
నిజానికి అసూయపడే వ్యక్తులకు ఏది సరైనది.ఏది తప్పు అనే స్పృహ వీరికి ఉండదు.