శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం( Vajrapukotturu )లో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి బోనులో చిక్కింది.మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన నివాసంలోకి వెళ్లిన ఎలుగుబంటిని జూ అధికారులు పట్టుకున్నారు.
అనంతరం ఎలుగుబంటి విశాఖ జూ రెస్క్యూ సెంటర్ కు తరలించారు.ఎలుగుబంటి( Bear ) సంచారం నేపథ్యంలో ఉదయం నుంచి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.
అనంతరం స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.ఈ క్రమంలోనే ఎలుగుబంటిని బంధించిన జూ సిబ్బంది రెస్క్యూ సెంటర్ కు తరలించారు.
దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.