శ్రీకాకుళం జిల్లా: చీపురుపల్లి బాతువ రైల్వే గేట్ సమీపంలో సికింద్రాబాద్ నుండి గౌహతి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు సాంకేతిక కారణాల వల్ల గేటు దగ్గరే నిలిచిపోయింది.
ఈ క్రమంలో ట్రైను నిలవడంతో జనరల్ బోగీలో ఉన్న ప్రయాణికులు దిగడంతో భువనేశ్వర్ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొనడంతో సుమారు ఏడుగురు మరణించినట్లు సమాచారం.