విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన పోలే మల్లయ్య గొర్రెలు కాపరి,రోజు వారీగా గొర్రెలను మేపడానికి ఊరికి సమీపంలో ఎస్సారెస్పీ కాలువ వద్ద గల స్మశాన వాటిక దగ్గరలో మేతకు తీసుకెళ్లగా అక్కడే వున్న విద్యుత్ తీగలు పూర్తిగా కిందకు ఉండటం వల్ల షాక్ తగిలి గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

కాగా గొర్రెల కాపరికి తృటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

Latest Rajanna Sircilla News