త్వరలో లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో బీజేపీ ( BJP ) అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మేరకు 16 రాష్ట్రాల్లో లోక్ సభ అభ్యర్థుల పేర్లు చర్చించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ( BJP Central Election Committee ) ఖరారు చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, గోవా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై సీఈసీలో ప్రధానంగా చర్చించారు.
కాగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత యూపీ అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగింది.అలాగే పార్టీ కీలకంగా భావిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులపై కూడా చర్చ జరిగింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టిక్కెట్లు దక్కాయని సమాచారం.దీంతో ఇవాళ బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
దీంతో అభ్యర్థుల పేర్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.