బాపట్లలో దారుణం.. బాలుడిని హత్య చేసిన స్నేహితుడు

బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది.ఓ బాలుడిని స్నేహితుడే హత్య చేశాడు.

పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ ఉదయం ట్యూషన్ కు వెళ్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు.

ఈ ఘటన చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంలో చోటు చేసుకుంది.

పెట్రోల్ దాడిలో తీవ్రగాయాల పాలైన అమర్నాథ్ ను గుంటూరు జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.అమర్నాథ్ ను తన స్నేహితుడు మరికొందరితో కలిసి హత్య చేశాడని తెలుస్తోంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్10, మంగళవారం 2024

Latest Latest News - Telugu News