పొంచి ఉన్న కరెంట్ ప్రమాదం ను ముందే పసిగట్టిన మాజీ ఎంపీటీసీ.

వైర్ల కింద ఉన్న చెట్ల ను తొలగింపజేసిన మాజీ ఎంపీటీసీ( MPTC ).పోన్ కాల్ కు 20 నిమిషాల్లో స్పందించిన మాజీ ఎంపీటీసీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల రైతు చర్చ మండలి వద్ద ప్రమాదకరంగా ఉన్న కరెంట్ తీగల కారణంగా తరచూ విద్యుత్ బ్రేక్ డౌన్ కావడం, విద్యుత్ వైర్లు ఒకదానికి ఒకటి తాకి మంటలు చెలరేగుతున్న విషయం మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్( oggu balaraju yadav ) కు అక్కడి వార్డు ప్రజలు పోన్ ద్వారా సమాచారం అందించగా వెంటనే స్పందించి మంటలు చెలరేగుతున్న సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ అధికారులతో పంచాయతీ అధికారులతో మాట్లాడి వెంటనే చెట్ల కొమ్మలను తొలగింపజేశారు.ఇట్టి చెట్ల వద్ద నుండి అంబేద్కర్ నగర్ కు వెళ్ళే విద్యుత్ లైన్ నుండి సరఫరా కు లైన్ క్లియర్ అయింది.

పోన్ కాల్ కు స్పందించి వెంటనే పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే ఊహించి అరికట్టిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు 8,9,13,14 వ వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Latest Rajanna Sircilla News