తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మన దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వస్తూ ఉంటారు.శ్రీవారి దేవాలయంలో ప్రత్యేక సేవలను ప్రత్యక్షంగా చూసి ఏడుకొండల వాడి ఆశీస్సులను పొందాలని భక్తులు పరితపిస్తూ ఉంటారు.
ఈ మేరకు లక్షలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.తిరుమల కు రాలేని భక్తులకు కూడా స్వామివారిని దర్శించుకునే సేవలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం టీటీడీ కల్పిస్తున్న సంగతి దాదాపు చాలామంది భక్తులకు తెలుసు.
వర్చువల్ సేవా పేరుతో ఈ విధానాన్ని టిటిడి అమలు చేస్తూ వస్తోంది.కళ్యాణోత్సవం, ఉంజలా సేవా, అజిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపం, కలరణ సేవలకు సంబంధించిన ఆన్లైన్ వర్చువల్ సేవ టికెట్లు మరియు సంబంధిత దర్శన కోటాను జనవరి 10వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు తిరుమల దేవస్థానం అధికారులు వెల్లడించారు.
![Telugu Bhakti, Devotional, Kalyanotsavam, Tirumala, Unjala Seva-Latest News - Te Telugu Bhakti, Devotional, Kalyanotsavam, Tirumala, Unjala Seva-Latest News - Te](https://telugustop.com/wp-content/uploads/2023/01/Srivari-Ee-Seva-Tickets-release-on-10th-Januaryc.jpg )
ఆ తేదీలలో స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల దేవస్థానం అధికారులు అధికారులు వెల్లడించారు.శ్రీవారి దేవాలయంలో బాలలయం ఏర్పాటు 22 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ సేవ మరియు అనుబంధ దర్శనా టికెట్లు కూడా అందుబాటులో ఉండవని వెల్లడించింది.టీటీడీ స్థానికలయాలు అనుబంధ దేవాలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టాలని జేఈఈఓ శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.దేవాలయ అధికారులు ఇతర విభాగాల అధికారులతో సోమవారం ఉదయం జేఈవో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.
![Telugu Bhakti, Devotional, Kalyanotsavam, Tirumala, Unjala Seva-Latest News - Te Telugu Bhakti, Devotional, Kalyanotsavam, Tirumala, Unjala Seva-Latest News - Te](https://telugustop.com/wp-content/uploads/2023/01/Srivari-Ee-Seva-Tickets-release-on-10th-Januaryb.jpg )
ఈ సందర్భంగా జై ఓ మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం, తిరుపతి శ్రీ కోదండ రామాలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, నారాయణపురం, దేవుని కడప తదితర దేవాలయాల్లో రథసప్తమి సందర్భంగా వాహన సేవలతో పాటు చక్కగా కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం.అన్ని దేవాలయాల్లో వాహనాలు పటిష్టతను ముందస్తుగా పరీక్షించాలని డి.ఎఫ్.ఓకు సూచించారు.
DEVOTIONAL