ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul Hegde ) జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో శనివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యత ఉన్నదని, ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్న ఎన్నికల్లో పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Latest Suryapet News