ఆలయానికి ఇచ్చిన ఆవు దూడను అమ్ముకున్న వైనం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ మోనికుంట మల్లన్న దేవస్థానానికి ఒక భక్తుడు కానుకగా ఇచ్చిన ఆవు, దూడను ఆలయ పూజారులు అమ్ముకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దీనిపై ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో పూజారిపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు నక్క గంగాధర్, పెరక గంగరాజు గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయానికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగతనంగా అమ్ముకున్న పూజారులపై కఠిన చర్యలు తీసుకొని వాళ్లను ఆలయ నుంచి పూజారిగా తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Latest Rajanna Sircilla News