మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఒడ్డెర సంఘం కులస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని శివరాత్రి వారి ఒడ్డెర సంఘం నకు చెందిన సుమారు 150 మందికి పైగా వడ్డెర సంఘం వారు స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.

బి ఆర్ ఎస్ ప్రభుత్వం బిసి బందు పథకం ప్రవేశ పెట్టి మా గ్రామంలో ఒక్క వడ్డెర కులస్తుడికి కూడా బిసి బందు ఇవ్వలేదని,బిసి బందు కు అర్హులము కానీ మేము బి ఆర్ ఎస్ కు ఓట్లు వేయడానికి ఎలా పనికి వస్తామని వారు అవలంబిస్తున్న విధానాలు నచ్ఛక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం సభ్యులు శివరాత్రి రాజం,కుమార్, కుంచం కనుకయ్య,శివరాత్రి నాంపెల్లి, దేవరాజు,దేవయ్య,లక్ష్మి, పద్మ, దేవలక్ష్మి, నర్సవ్వ ,అంజయ్య, బద్రి లతో పాటు సంఘం సభ్యులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మా రెడ్డి, పందిర్ల లింగంగౌడ్, గుండాడి రాంరెడ్డి,గంట ఆంజా గౌడ్, గంట బుచ్చయ్య గౌడ్,గంట రమేష్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News