జాతీయ అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(Yellareddypet ) మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్, దుంపెన రమేష్ లకు ఈ నెల 10న విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ వారు కళా రత్న అవార్డు, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ అవార్డులను ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వంగ గిరిధర్ రెడ్డి( Vanga Giridhar Reddy ) ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వంగ గిరిధర్ రెడ్డి, ప్రముఖ ఫోటోగ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, నేవూరి సురేందర్ రెడ్డి, యమగొండ పద్మా రెడ్డి, సాన రవి, నూకల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News