దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది.ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతూ ఏళ్ల తరబడి ఆ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారు.
అయితే ఒక యువతి మాత్రం తొలి ప్రయత్నంలోనే ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వార్తల్లో నిలిచారు.ఈ యువతి పేరు మృణాళిని( Mrunalini ) కాగా గజ్వేల్( Ghazwal ) కు చెందిన ఈ యువతి ఈరోజు సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోనున్నారు.
డీఎల్, జేల్ ఉద్యోగ ఖాళీలతో పాటు టీజీటీ, పీజీటీ, సాంఘిక శాస్త్రంలో( TGT, PGT, in Social Science ) పీజీటీ ఉద్యోగాలకు ఆమె ఎంపికయ్యారు.ప్రస్తుతం రావి సీతాదేవి రామాయణం అనే పద్య కావ్యంపై ఆమె పీహెచ్డీ చేస్తున్నారు.
ఓయూలో పీహెచ్డీ చేస్తూ 5 ప్రభుత్వ ఉద్యొగాలు సాధించిన మృణాళిని సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.స్థానికులు ఆమెను ఎంతో ప్రశంసిస్తున్నారు.
![Telugu Ghazwal, Science, Mrunalini-Inspirational Storys Telugu Ghazwal, Science, Mrunalini-Inspirational Storys](https://telugustop.com/wp-content/uploads/2024/03/mrunalini-inspirational-success-story-details-here-goes-viral-in-social-mediaa.jpg)
గజ్వేల్ లోనే పీజీ వరకు చదువుకున్న మృణాళిని డిగ్రీ కాలేజ్ లో గెస్ట్ లెక్చరర్ గా కూడా పని చేశారని తెలుస్తోంది.తండ్రి తెలుగు టీచర్ కావడంతో రావి సీతాదేవి రామాయణంపై ఆమె పీహెచ్డీ చేస్తున్నారు.మృణాళిని డీఎల్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నారని సమాచారం అందుతోంది.మృణాళిని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
![Telugu Ghazwal, Science, Mrunalini-Inspirational Storys Telugu Ghazwal, Science, Mrunalini-Inspirational Storys](https://telugustop.com/wp-content/uploads/2024/03/mrunalini-inspirational-success-story-details-here-goes-viral-in-social-mediab.jpg)
మృణాళిని టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మృణాళిని రాబోయే రోజుల్లో మరిన్ని పోటీ పరీక్షలు రాసే అవకాశం అయితే ఉంది.మృణాళిని కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నో విజయాలు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.మృణాళిని తల్లీదండ్రులను సైతం నెటిజన్లు ఎంతో అభినందిస్తున్నారు.తల్లీదండ్రుల ప్రోత్సాహం ఉంటే మాత్రమే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.