వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరిన కొత్తపేట రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట( Kothapeta ) గ్రామంలో జాప్యంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు ఇప్పటికైనా అధికారులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొత్తపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు.

దీనితో చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas) కు సమాచారం ఇచ్చారు.

పెద్ద మొత్తంలో దాన్యం ఈ గ్రామంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం రెండు లారీలు మాత్రమే వచ్చి కొనుగోలు చేశారు.మరి ఇంకా లారీలు పంపిచాలని అధికారులను కొత్తపేట గ్రామస్తులు కోరుతున్నారు.

అకాల వర్షాలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కోరుతున్నారు.

ఎమ్మెల్యే నిధుల నుండి ఐమాక్స్ లైట్లు మంజూరు
Advertisement

Latest Rajanna Sircilla News