నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగారు.
అది కాస్తా ముదరడంతో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు.ఈ దాడుల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఈటల రాజేందర్ కార్లు ధ్వంసం అయ్యాయి.
అయితే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఈటల రాజేందర్ ప్రచారం చేస్తుండగా ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది.ఈ రాళ్ల దాడిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.