మహాశివరాత్రి మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి జరుపుకుంటారు.పరమశివుడి అనుగ్రహం కోసం ఉపవాసలు, జాగరణలు పాటిస్తూ ఉంటారు.
దానివల్ల స్వామి వారి ఆశీస్సులు లభిస్తాయని అంతా శుభం జరుగుతుందని నమ్ముతారు.ఈ సంవత్సరము మహా శివరాత్రి ఫిబ్రవరి 18న వస్తుంది.
శివరాత్రి పర్వదినాన స్వామి వారి అనుగ్రహం కోసం భక్తులు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.అయితే స్వామి అనుగ్రహం లభించింది అనడానికి కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి.
శివరాత్రి వేళ ఈ సంకేతాలు కనిపిస్తే శివుడి అనుగ్రహం మీపై ఉన్నట్లేనని వేద పండితులు చెబుతున్నారు.ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివ రాత్రికి కొన్ని రోజుల ముందు కలలో లింగానికి పాలతో అభిషేకం చేస్తున్నట్లు మీకు కల వస్తే మీ కష్టాలు అన్ని దూరం అయిపోతాయి.మీ జీవితంలో అంతా సుఖ సంతోషాలు ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే రుద్రాక్ష ను శివుడి స్వరూపంగా పరిగణిస్తారు.మహా శివరాత్రి కి ముందు రుద్రాక్ష మాలలోని ఒక రుద్రాక్ష అయిన కలలో కనిపిస్తే, అది శివుని అనుగ్రహం మీపై ఉంది అని భావించవచ్చు.
అనుగ్రహంతో మీ దుఃఖాలు, రోగాలు, దోషాలు అన్ని దూరమై అంతా శుభమే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.
![Telugu Bhakti, Devotional, Lord Shiva, Lord Vinayaka, Maha Shivratri, Parvati De Telugu Bhakti, Devotional, Lord Shiva, Lord Vinayaka, Maha Shivratri, Parvati De](https://telugustop.com/wp-content/uploads/2023/02/Parvati-devi-Lord-Shiva-devotional-shiva-lingam-lord-vinayaka.jpg")
ఇంకా చెప్పాలంటే కలలో శివుడు పార్వతి కలిసి కూర్చున్నట్లు కనిపిస్తే అది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని తెలుసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తీరిపోయి వారి జీవితంలో సంతోషం వికర్షిస్తుందని గట్టిగా నమ్ముతారు.శివరాత్రికి ముందు కలలో నాగదేవత కనిపించడం సంపద పెరుగుదలకు సంకేతంగా భావిస్తారు.
LATEST NEWS - TELUGU