విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు.విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తుందని నిన్న కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.ఈ మేరకు ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ పాదయాత్ర స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు సాగనుంది.మరోవైపు ఈవోఐ బిడ్డింగ్ కు ఇవాళ్టితో గడువు ముగియనుంది.