ప్రమాదం తర్వాత మొదట వారిద్దరినే చూసాను... సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) విరూపాక్ష సినిమా( Virupaksha Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 I Saw Them First After The Accident Sai Dharam Tejs Comments Are Viral Accident,-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఏలూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ తన ప్రమాదం( Accident ) గురించి పలు విషయాలను తెలియచేశారు.

ఈ సినిమా షూటింగ్ కు ముందు ఈయన రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బైక్ పై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.తాను ప్రమాదానికి గురై మీ అందరిని చాలా టెన్షన్ పెట్టాను అందుకు నన్ను క్షమించండి అంటూ ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు.

ఈ ప్రమాదం జరిగిన తర్వాత నాకు స్పృహ రాగానే తాను మొదటగా మా అమ్మ, నా తమ్ముడిని వీరిద్దరిని చూశానని తెలిపారు.అయితే వారికి సారీ చెప్పడానికి ప్రయత్నించిన నాకు మాటలు రావడంలేదని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.

బాధ ఒక మనిషిని ఎంతగా మార్చగలదో అప్పుడు తనకు అర్థం అయిందనిఅప్పుడే అర్థమైంది తన జీవితంలో వచ్చినటువంటి ఎన్నో సవాళ్లను స్వీకరించి తిరిగి మీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నా.మీ ప్రేమను పొందాలన్నదే నా లక్ష్యం.మీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గొద్దు అంటూ ఈయన ఈ సందర్భంగా తెలిపారు.ఇక మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ వాడండి అంటూ ఈయన అభిమానులకు ఈ సందర్భంగా సూచనలు చేశారు.

ఇలా సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube