రాజన్నను దర్శించుకున్న హై కోర్టు జడ్జి

పూర్ణ కుంభం తో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నందా ఆదివారం దర్శించుకున్నారు.

అంతకుముందు జడ్జి కి ఆలయాచకులు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు .

కోడె మొక్కులు చెల్లించుకున్నారు .అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.

వారి వెంట జిల్లా జడ్జి ప్రేమలత, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి సుజన ఆర్డిఓ రాజేశ్వర్, డి.ఎస్.పి నాగేంద్ర చారి, ఆలయ ఈవో రామకృష్ణ, ఏఈఓ బీ శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

Latest Rajanna Sircilla News