మన దేశంలోని ప్రజలు ఎక్కువగా జరుపుకునే పండుగలో మహాశివరాత్రి( Mahashivratri ) ముఖ్యమైనది అని కచ్చితంగా చెప్పవచ్చు.శివునికి ఎంతో ఇష్టమైన ఈ రోజు మహా శివరాత్రి పండుగను జరుపుకుంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే చాంద్రమాన మాసం ఫాల్గుణ మాసంలో 14వ రోజు ఈ పండుగను జరుపుకుంటారు.ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన శివరాత్రి పండుగను జరుపుకుంటున్నారు.
ఈ రోజున అందరూ ఉపవాసాలు( fasting ) చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు.అయితే శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారో.
ఉపవాసం చేస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అలాగే శివరాత్రి రోజున ఉదయం లేచి, స్నానాలు చేసి శివయ్య పూజకు సిద్ధం చేసుకోవాలి.ఉదయం ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని చెబుతున్నారు.అందుకే హిందూ ప్రజలంతా ఈ రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తారు.
ఆ ఒక్క రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే సంవత్సరం అంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.అలా చేయడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు.ఉపవాసం ఉండేవారి లో కొందరు అసలు నీళ్లు కూడా తాగకుండా ఉంటారు.అలా చేయడం వల్ల శరీరం శుభ్రం అవుతుందని భావిస్తారు.అయితే మరి కొందరు పండ్లు, పాలు, టిఫిన్స్( Fruits, milk, tiffins ) చేస్తారు.వాటికి బదులుగా ఇలాంటివి తీసుకుంటే మంచిదనీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సగ్గు బియ్యం, మినుములు, గుమ్మడికాయ, బంగాళదుంపలు ఫుల్ మఖాన, అరటిపండు, పెరుగు వంటివి తీసుకోవచ్చు.
అలాగే గోధుమలు, బియ్యం, కూరగాయలు, పప్పులు వంటి ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి.అలాగే శివునికి బియ్యం, పాలతో చేసిన తీపి వంటకాలను సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.