మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.ఒక్కొక్క దేవాలయంలో ఒక్కోరకమైన పూజలను చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా కొన్ని ప్రత్యేక రోజులలో కొందరు దేవుళ్లకు మాత్రమే కొంతమంది భక్తులు పూజలు చేస్తుంటారు.ఇలా ప్రత్యేకమైన రోజులలో దేవుళ్లకు పూజించి వారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు.
అయితే ప్రత్యేకంగా మంగళవారం శనివారం మాత్రమే ఆంజనేయ స్వామిని పూజించేందుకు అనుకూలమైన రోజులని చాలామంది వేద పండితులు చెబుతున్నారు.
సాధారణంగా అందరూ ఈ రోజుల్లోనే హనుమంతుని పూజించడానికి ఇష్టపడుతుంటారు.
మంగళ శనివారాల్లో హనుమంతుని ఎందుకు పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ఆంజనేయస్వామి చాలామంది భక్తులు ఉన్నారు.
ఈ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల కోరికలు తీరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.హనుమంతుని నామస్మరణతో బాధలు దుఃఖాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు.
అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉంటుందని చెబుతారు.హనుమంతుడు బలం ధైర్యం ఆనందం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతున్నారు.
మంగళవారం, శనివారంలలో ఆంజనేయుని పూజించడానికి చాలా పవిత్రమైన రోజుగా వేద పండితులు చెబుతున్నారు.
మంగళవారమే ఎందుకు పూజ చేస్తారంటే హనుమంతుడు ఆ పరమేశ్వరుని అవతారం అని భక్తులు నమ్ముతారు.
హనుమాన్ కేసరి, అంజన దంపతుల కుమారుడు.హనుమంతుడు క్షేత్ర మాసం మొదటి రోజున జన్మించాడు.
ఆంజనేయ జన్మదినం మంగళవారం కాబట్టి భక్తులు మంగళవారం రోజు ఆంజనేయస్వామికి పూజ చేయడానికి ఇష్టపడతారు.మంగళవారం రోజు హనుమంతునీ పూజిస్తే కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు అని చాలామంది నమ్ముతారు.
శనివారం రోజు హనుమంతుని పూజించడానికి పవిత్రమైన రోజుగా చాలామంది భావిస్తారు.సాధారణంగా శనివారం రోజు అందరూ శని దేవున్ని పూజిస్తారు.అయితే శనివారం శని దేవుడు సంతోషిస్తాడని భక్తుల నమ్మకం.హనుమంతున్ని పూజించడం వల్ల అశ్విని దేవునికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని కూడా చాలామంది నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే మంగళవారం హనుమంతుని కోసం ఉపవాసం కూడా ఉంటారు.
LATEST NEWS - TELUGU