సూపర్ స్టార్ రజనీకాంత్ కి చాలా కోపం వచ్చింది.దాంతో లాయర్ ఎలంబరతి సుబ్బయ్య లైన్లోకి వచ్చాడు.
ఇంతకీ రజినీకి కోపం రావడానికి కారణం ఏంటి అంటే తన పర్మిషన్ లేకుండా తన పేరును తన డైలాగులను తన ఫోటోలను కమర్షియల్ గా వాడుకుంటున్నారు అని ఆయన దృష్టికి వెళ్లిందట.అంతా లాయర్ ని పిలిచి అందరిపై కేసులు పెట్టించమని చెప్పారట రజనీకాంత్.
కానీ ఎంతమందికి అలా నోటీసులు పంపించగలరు అందుకే ముందుగా ఒక ప్రైవేటు నోటీస్ ని బయటకు వదిలారు.ఆ తర్వాత కూడా ఆయనకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా కూడా ఆయన పర్మిషన్ లేకుండా వాడుకుంటే ఆ సంస్థను లేదా ఆయా వ్యక్తులను టార్గెట్ చేసి కేసులు పెట్టొచ్చు అని ఇలా చేశారట.
అప్పుడు గుర్తొచ్చిన విషయం ఏమిటంటే బ్రహ్మానందం పేరు. బ్రహ్మానందం అనే ఒక వ్యక్తి లేదా ఆయనకు సంబంధించిన డైలాగులు ఫోటోలు లేకపోతే 99% మీమర్స్ కి అసలు పని లేదు.అంతలా ముడి సరుకుగా సోషల్ మీడియా బ్రహ్మానందం నీ ఆయన ఫోటోలని ఆయన హావభావాలను వాడుకుంటుంది.ఇక బ్రహ్మానందం కేసు పెట్టాలి అని డిసైడ్ అయితే కనుక సోషల్ మీడియా మూసుకోవాల్సిందే.
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో రజినీకాంత్ అర్థం కావడం లేదు.పైగా వారిచ్చిన పబ్లిక్ నోటీసు లో కేవలం ఒక స్టీల్ కంపెనీ, ఒకటి రెండు వార్త కంపెనీల పేర్లు ఉన్నాయి.
ఈ మాత్రం దానికి పబ్లిక్ గా నోటీస్ ఇవ్వడం ఎందుకు.వారికే స్వయంగా పంపించొచ్చు కదా అని ప్రతి ఒక్కరికి కలిగిన అనుమానం.
ఇక తెలుగులో సైతం ఇలా నోటీసులు పంపించిన దాఖలాలు ఉన్నాయి.మంచు విష్ణు తనను ట్రోలింగ్ కోసం వాడుకుంటున్నారు అని చాలామందికి నోటీసులు ఇచ్చాడు.ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హేమ లాంటి వ్యక్తులు కూడా పబ్లిక్ గా ఎన్నోసార్లు గరం అయ్యారు.ఇలా ఎంతమంది ఏం చేసిన సోషల్ మీడియాని లేదా మీమర్స్ ని ఏమీ చేయలేరు కానీ హద్దుల్లో మీమ్స్ వేయడం ఫన్నీ గానే ఉంటుంది.ఈ మాత్రం దానికి ఇంతలా నోటీసుల వరకు ఎందుకు వెళ్లడం, అభిమానుల మనసు నోచుకునేలా చేయడం ఎందుకు ?
.