ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 12 మంది లబ్ధిదారులకు మంజూరైన 4.

7లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్థానిక సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి , ఎంపీటీసీ సభ్యులు పందిర్ల నాగరాణి పరిసరాములు గౌడ్, ఎలగందుల అనసూయ నరసింహులు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డిలు , కలిసి సోమవారం పంపిణీ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్, గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, కొండ రమేష్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, సింగల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News