బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో అర్హులైన వారికి దళిత బంధు దరఖాస్తు అందజేత.

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ( BJP ) దళిత మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు బిజెపి దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి శేఖర్ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధికారి కి వినతి పత్రం తో పాటు పలువురు అర్హులైన దళితులతో దళిత బంధు దరఖాస్తును అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి మామిడి శేఖర్( Shekhar) మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని కొందరికి మాత్రమే దళిత బంధు అందించారని మరికొందరికి పూర్తిస్థాయిలో దళిత బంధు( Dalit bandhu ) అందలేదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్, మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రావణ్, సీనియర్ నాయకులు మేకల మల్లేశం, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, కుడుముల శ్రీహరి,కోమటిరెడ్డి అనిల్, దరఖాస్తు దారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Latest Rajanna Sircilla News