రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం

రాజన్న సిరిసిల్ల జిల్లా :దక్షిణ కాశీగా పిలవబడుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో జనసంద్రంగా మారాయి.

అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు.సేవలో తరించారు.

ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు.

Validation Check 2026
Advertisement

Latest Rajanna Sircilla News